ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమ్ముడి సరసనా మెరిసింది...ఇపుడు మెగా సరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 06, 2022, 07:28 PM

తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు శ్రుతి హాసన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లో మెరిసిన ఈ తార తాజాగా మెగాస్టార్ చిరంజీవి సరసన నట్టించేందుకు అవకాశమొచ్చిందటా. బాలీవుడ్ సినిమాలపై దృష్టిపెట్టిన శ్రుతి హాసన్, తెలుగు తెరకి కొంతకాలం పాటు దూరమైంది. ఆ తరువాత తన కెరియర్ ను చక్కదిద్దుకునే ప్రయత్నంలో పడింది. అందులో భాగంగా ఆమె చేసిన 'క్రాక్' సినిమా కలిసొచ్చింది. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ ను తెచ్చిపెట్టింది. అదృష్టం తలుపు తట్టునట్టుగా ప్రభాస్ 'సలార్' సినిమా నుంచి కూడా అవకాశం ఆమెను వెతుక్కుంటూ వెళ్లింది. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె గోపీచంద్ - బాలకృష్ణ కాంబినేషన్లోని సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక చిరంజీవి సినిమాకి కూడా సైన్ చేయడానికి ఆమె సిద్ధంగా ఉందనేది తాజా సమాచారం. చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ 'వాల్తేర్ వీర్రాజు' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ ను సంప్రదించారు. దాదాపు ఆమెనే ఖరారు అవుతుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa