ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నే కుప్పం వదలా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 06, 2022, 07:35 PM

తాను  ఎప్పటికీ కుప్పం నియోజకవర్గం వదలను అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం వచ్చారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఆయన దేవరాజుపురంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పర్యటనకు వచ్చానని వెల్లడించారు. మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటానని చెప్పారు. తాను కుప్పం నియోజకవర్గాన్ని వదిలిపెడుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎప్పటికీ కుప్పం నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నేతలు మారినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటే ఉన్నారని చంద్రబాబు కొనియాడారు. అధికార పార్టీ ఇబ్బందిపెడితే 20 రెట్లు ఎక్కువగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. కార్యకర్త ఒంటిపై పడే దెబ్బను నాకు తగిలిన దెబ్బగానే భావిస్తా అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa