ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్యప్రభ వాహనంపై శ్రీవారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2017, 09:59 AM

తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరుడు శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. వజ్ర కవచం ధరించి ఉదయం సూర్యకిరణాలు ప్రసరిస్తుండగా నాలుగు మాడ వీధుల్లో సూర్య మండలం మధ్యనున్న నారాయణమూర్తిని నేనేనని భక్తులకు బోధిస్తూ స్వామివారు దర్శనవివ్వగా, భక్తకోటి గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రం ప్రతిధ్వనించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa