మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కంజూర్మార్గ్లోని ఎన్జీ రాయల్ పార్క్ ఏరియాలో ఉన్న నివాస ప్రాంతాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడున్న పది అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. తొమ్మిదో అంతస్థు, పదో అంతస్థుల గల అపార్ట్మెంట్స్లో అగ్నీ కీలలు ఎగసిపడుతున్నాయి. చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టాయి. మంటలను అదుపు చేయడానికి ఫైర్ ఇంజన్లతో ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియరాలేదు. అయితే మంటలు కారణంగా భవనంలోని ఇతర అపార్ట్స్మెంట్లో ఉన్నవారు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులు ఒంటి గంట సమయంలో అగ్ని మాపక సిబ్బందికి, పోలీసులకు అందజేశారు. దాంతో వారు ఆరు ఫైర్ ఇంజన్స్, నాలుగు జంబో ట్యాంకర్లు, రెండు వాటర్ ట్యాంకర్లు, అంబులెన్స్తో అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. జనవరి నెలాఖరులో కూడా ముంబైలో ఓ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. కంజుర్ మార్గ్ ప్రాంతంలోని విశాలంగా ఉన్న గడ్డి మైదానంలో మంటలు చెలరేగాయి. మెట్రో కార్ షెడ్ నిర్మించనున్న కంజుర్మార్గ్ బస్టాప్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్మేశాయి. మంటల వల్ల ఆ పరిసర ప్రాంతంలో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అప్పుడు అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa