ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతిఒక్కరూ పర్యావరణ స్పృహ పెంచుకోవాలి : భూమి పడ్నేకర్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 29, 2020, 10:44 AM

ప్రతిఒక్కరూ పర్యావరణ స్పృహ పెంచుకోవాలని బాలీవుడ్ హీరోయిన్ ‌ భూమి పడ్నేకర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆమె ఈ సందేశం ఇచ్చారు. ప్రజలు తమరోజువారీ అలవాట్లను మార్చుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఈ బాలీవుడ్‌ నటి కోరారు. ఆమె తన సందేశాన్ని ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేసేకంటే ముందు దేశంలో మొక్కలు ఎక్కువ సంఖ్యలో నాటుతూ, సంరక్షిస్తున్న ప్రాంతాల చిత్రాలను పోస్ట్‌ చేశారు. ‘మొక్కలను పెరగనివ్వండి.. ఊపిరి పీల్చుకోనివ్వండి’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. దేశంలో సహజ వృక్షజాలాన్ని పెరగనివ్వండి అనే అర్థంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మనమందరం కలిసి సంతోషకరమైన కుటుంబంగా నివసించే స్వచ్ఛమైన, అతిపెద్ద ఆకుపచ్చ ప్రపంచాన్ని ఊహించుకోండి. ప్రకృతి మనకు ప్రసాదించే వాటిని రక్షించడం చాలా ముఖ్యం’ అని రాశారు. కాగా, పడ్నేకర్‌ గతేడాది ‘క్లైమేట్ వారియర్’ అనే పేరుతో ప్రకృతి పరిరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa