SSరాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నటిస్తున్న 'RRR' సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ నెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ను శరవేగంగా జరుపుకుంటుంది.తాజాగా జరిగిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రాజమౌళి,సినిమాలోని పోస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ గురించి గొప్పగా మాట్లాడాడు,అది అటామ్ బాంబ్ లాగా ఉంటుందని చెప్పాడు. ఈ ఎపిసోడ్ సినిమాకు మెయిన్ హైలైట్ అవుతుందని అంటున్నారు.ఈ భారీ బడ్జెట్ మూవీలో అలియా భట్,సముద్రఖని,అజయ్ దేవగన్,శ్రియా శరణ్,ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa