![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 05:57 PM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా.. ఈరోజు (మార్చి 18న) సభలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన సహచర సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. సభలో తానే అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేనని.. ఏం మాట్లాడాలో తనకు తెలుసని.. ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. దానం నాగేందర్ అంత సీరియస్ కావాల్సినంతగా ఏం జరిగిందనేగా మీ డౌటనుమానం.
అయితే.. ఈరోజు (మార్చి 18న) సభలో నిర్వహించి ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఎమ్మెల్యే దానం నాగేందర్.. ప్రస్తుతం హైదరాబాద్లో అప్లయ్, అప్లయి.. నో రిప్లయి అనే పద్ధతిలో వ్యవస్థ నడుస్తోందంటూ పలువురు అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. అధికారులపై ప్రీ విలేజ్ నోటీసు ఇస్తానని చెప్పారు. తన నియోజకవర్గంలో క్యాంపు ఆఫీస్కు స్థలం కావాలని చాలా సార్లు విజ్ఞప్తి చేశానని స్పీకర్కు చెప్పుకొచ్చారు. తన విజ్ఞప్తి పక్కన పెట్టి వేరే ఆఫీస్కు శంకుస్థాపన చేశారన్నారు. అందుకే రెగ్యూలర్ స్టైల్లోనే వెళ్లి శిలాఫలకం కూలగొట్టిన్నట్లు చెప్పుకొచ్చారు. ఈడబ్ల్యూఎస్ కాలనీలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని.. దాని మీద కూడా జీహెచ్ఎంసీ అధికారులు గానీ పోలీస్ అధికారులు గానీ పట్టించుకోవటం లేద్నారు. సోషల్ మీడియాకు భయపడి వెంటనే రెస్పాండ్ అయ్యే అధికారులు ఎమ్మెల్యే ఫిర్యాదుకు మాత్రం స్పందించటం లేదని దానం నాగేందర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తన క్యాంప్ ఆఫీసు గురించి గత 15 నెలల నుంచి విజ్ఞప్తి చేస్తున్నానని దానం చెప్పుకొచ్చారు. తాము అడిగిన క్యాంప్ ఆఫీసు గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వద్ద సమాచారం లేదని.. జీహెచ్ఎంసీ వద్ద సమాచారం లేదన్న దానం.. ఇది ఆశ్చర్యకరమే అంటూ చురకలంటించారు. తన నియోజకవర్గంలోని రోడ్ నెంబర్ 10లో ఈద్గా గ్రౌండ్ ఉందన్నారు. ఆ గ్రౌండ్ను ఒక సబ్స్టేషన్ గురించి ఇచ్చేశారని తెలిపారు. ఈద్గా గ్రౌండ్లో తనకు క్యాంప్ ఆఫీసుకు స్థలం ఇవ్వమంటే మాత్రం ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సబ్ స్టేషన్కు కూడా తన ప్రమేయం లేకుండానే శంకుస్థాపన చేశారని.. తన రెగ్యులర్ స్టైల్లోనే వెళ్లి శిలాఫలకాన్ని పలగొట్టినట్టు చెప్పుకొచ్చారు.
తాను మంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాన చేసి ఈడబ్ల్యూఎస్ కాలనీ కట్టించాననని దానం నాగేందర్ గుర్తుచేశారు. ఆ కాలనీలో ఓ వ్యక్తి.. కొందరికి డబ్బులు ఇచ్చి అక్కడి కొన్ని ఇండ్లు లాక్కున్నాడని ఆరోపించారు. ఇప్పుడు దాదాపు ఆరు ఫ్లోర్లతో ఇండ్లు కట్టాడని.. ఈ విషయంపై జోనల్ కమిషన్కు కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఎమ్మార్వో, తహశీల్దార్, డీసీకి కూడా విషయాన్ని తెలియజేశానని.. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చానని.. ఇది తన బాధ్యతగా దానం నాగేందర్ వెల్లడించారు.
తాను మాట్లాడుతున్న సమయంలోనే.. తాను చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నామంటూ మంత్రులు నోట్ చేసుకుంటామని చెప్పటంతో.. దానం నాగేందర్ సీరియస్ అయ్యారు. నోట్ చేసుకోవటం కాదు.. తన నియోజకవర్గ అంశాలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని దానం కాస్త గట్టిగానే చెప్పారు. నోట్ చేసుకుంటారు.. ఆ తర్వాత డస్ట్ బిన్లో వేస్తారని.. తాను కూడా మంత్రిగా చేశానని.. తాను అలా చేశాను కాబట్టే ఇప్పుడు చెప్తున్నానని దానం చెప్పుకొచ్చారు.