|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:59 PM
మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు గురువారం జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఆయన ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.