|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 10:42 AM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ డీసీపీ కార్యాలయంలో ఈ నెల 2వ తేదీన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు, ఆల్విన్ కాలనీకి చెందిన వంశీ కృష్ణ (32) అనే బైక్ మెకానిక్, మరియు మట్ట భరత్ రాజీవ్ గాంధీ (23) లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2,27,000/- నగదు, ఒక గ్లామర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.