|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:21 PM
రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. వరుసగా మూడో రోజు గురువారం కూడా గాలి నాణ్యత 'పూర్' కేటగిరీలోనే కొనసాగుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాల ప్రకారం, ఈ ఉదయం 7 గంటలకు నగరంలో సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 285గా నమోదైంది. ఇది 'వెరీ పూర్' కేటగిరీ (301)కి చాలా దగ్గరగా ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.నగరంలోని పదికి పైగా పర్యవేక్షణ కేంద్రాల్లో ఏక్యూఐ ఇప్పటికే 300 మార్కును దాటి 'వెరీ పూర్' కేటగిరీలో నమోదైంది. ఆనంద్ విహార్లో 300, అశోక్ విహార్లో 328, చాందినీ చౌక్లో 305, ఐటీఓ వద్ద 309గా కాలుష్య తీవ్రత రికార్డయింది. ఢిల్లీని ఆనుకుని ఉన్న నోయిడాలో సగటు ఏక్యూఐ 294గా ఉండగా, గ్రేటర్ నోయిడాలోని కొన్ని ప్రాంతాల్లో 331 వరకు నమోదైంది.