|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 01:03 PM
TG: సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తండ్రి రామచంద్రా రెడ్డి (9) బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. 10 వార్డులు, 2448 ఓటర్లు ఉన్న ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. అయితే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఉండటంతో ఓట్లు చీలి రామచంద్రా రెడ్డికి మేలు చేసే అవకాశం ఉంది.