|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 12:01 PM
మొదటి విడుత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, డీఎస్పీ రవీందర్ రెడ్డితో కలిసి మణుగూరు ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల తీరును పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ పరిశీలన ఎన్నికల సన్నద్ధతలో భాగంగా జరిగింది.