|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:54 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వేములవాడ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు గురువారం జరిగాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఆయన సతీమణి సునీల తమ స్వగ్రామమైన కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు ఈ సందర్భంగా తెలిపారు.