|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 08:01 PM
రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ లోని కేతిరెడ్డి పల్లి గ్రామంలో న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురయ్యారు. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఆమె హత్యతో న్యాయవాద సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ ఘటనపై న్యాయవాది కొంగళ్ల నవీన్ మాట్లాడుతూ, "చట్టాన్ని కాపాడే న్యాయవాదులకే రక్షణ లేకపోవడం దురదృష్టకరం. న్యాయవాదుల భద్రతను నిర్ధారించడంలో వ్యవస్థ విఫలమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి 'అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు' ను వెంటనే చట్టరూపంలోకి తీసుకురావాలి" అని డిమాండ్ చేశారు. ఈ హత్య న్యాయవాదుల భద్రతపై తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దోషులను అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి శిక్షించాలన్నారు ఈ నిరసనలో న్యాయవాదులు ముల్క వెంకట్ రెడ్డి, రంగారావు, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, తమ్మినేని హనుమంతరావు, కరీం, నయీమ్, హుస్సేన్, చలం, రామ్ రెడ్డి, రంజాన్, భాష, దొడ్డ శ్రీధర్, రియాజ్, శ్రీనివాస్, అవినాష్, హేమలత, పాషా పాల్గొన్నారు.