|
|
by Suryaa Desk | Sat, Apr 18, 2026, 02:35 PM
ఆన్లైన్ విధానం ఉన్నప్పటికీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో కొందరు ఉద్యోగులు ట్రేడ్ లైసెన్స్ల జారీలో అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. థియేటర్లు, ఫంక్షన్ హాల్స్, హోటళ్ల నుంచి పన్నులు వసూలు చేయకుండా, పాత బకాయిలున్నా కొత్త పేరుతో రెండో లైసెన్స్ జారీచేస్తూ అక్రమార్కులు కాసుల వర్షం కురిపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది.