|
|
by Suryaa Desk | Wed, Apr 22, 2026, 10:07 AM
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెదక్ ఆర్టీసీ బస్ డిపో ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు అధికారులు ప్రయత్నించగా, కార్మికులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. బస్సులు బయటకు రాకుండా గేటు వద్దే భైఠాయించిన కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో డిపో పరిసరాల్లో ఆందోళన నెలకొంది.