|
|
by Suryaa Desk | Fri, Apr 17, 2026, 11:59 AM
తెలుగు రాష్ట్రాల్లో 43 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బ తగలకుండా ఉండటానికి ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. కెఫిన్ ఉండే కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ తగ్గించాలి. లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు టోపీ, సన్ గ్లాసెస్, గొడుగు వాడాలి. ఆల్కహాల్, స్పైసీ, ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోరాదు. పిల్లలను మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్య ఎండలో బయటకు తీసుకెళ్లకూడదు.