|
|
by Suryaa Desk | Fri, Apr 17, 2026, 02:45 PM
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలో శుక్రవారం టీజీఎసి, పిఆర్టియు. టిఎస్, టపాస్ సంఘాల ఆధ్వర్యంలో తాసిల్దార్ సుందర్ రాజ్ కు ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు, న్యాయబద్ధమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ వినతిపత్రం సమర్పించారు. జూన్ 2 నాటికి పీఆర్సీ అమలు చేసి, రిటైరైన ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని, ఉద్యోగులందరికీ హెల్త్ కార్డ్స్ జారీ చేస్తూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ తక్షణమే అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం పునరుద్ధరించాలని, 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని సంఘాలు కోరాయి.