ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పటివరకు ఇద్దరూ జైలులోనే.. కవిత, కేజ్రీవాల్‌కు బిగ్ షాక్..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 09:13 PM

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీ నేటితో (ఆగస్టు 13) ముగియటంతో.. ఇద్దరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపర్చారు. అధికారుల వాదనలు విన్న ధర్మాసనం.. కవితతో పాటు కేజ్రివాల్‌ జ్యుడీషియల్ రిమాండ్‌‌ను మరో 20 రోజుల పాటు పొడిగించింది. తిరిగి.. సెప్టెంబర్ 2వ తేదీన ధర్మానసం ముందు హాజరుపర్చాలని స్పెషల్ జడ్జి జస్టిస్ కావేరీ బవేజా తీర్పునిచ్చారు. దీంతో.. వీళ్లిద్దరూ సెప్టెంబల్ 2వ తేదీ వరకు తీహార్ జైలులోనే జ్యూడీషియల్ ఖైదీలుగా ఉండాల్సిందే.


అయితే.. ఈ కేసులో అరెస్టయిన కవిత, కేజ్రీవాల్‌కు కోర్టులు బెయిల్ ఇవ్వకపోవటం గమనార్హం. కేజ్రీవాల్‌కు లోక్ సభ ఎన్నికల సమయంలో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. అవసరమైన బెయిల్ బాండ్ అందించనందున మళ్లీ రిమాండ్‌ ఖైదీగా తీహార్ జైలుకు రావాల్సి వచ్చింది. ఇటీవల.. బెయిల్ కోసం అరవింద్ కేజ్రివాల్ పెట్టుకున్న పిటిషన్‌ను ఆగస్టు 5వ తేదీన ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది అయితే.. కవితకు మాత్రం అరెస్టయిన నాటి నుంచి ఇప్పటివరకు బెయిల్ రాకపోవటం గమనార్హం. ఈ కేసులో కవితది ప్రధాన పాత్ర అని అధికారులు ఆరోపిస్తుండటంతో.. న్యాయస్థానాలు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ వస్తున్నాయి.


ఇప్పటికే.. రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవితకు చేదు అనుభవమే ఎదురవగా.. ఆగస్టు 9వ తేదీన సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. సోమవారం (ఆగస్టు 12న) ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించగా.. ఈ సమయంలో కవితకు మద్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మద్యంతర బెయిల్ మంజూరు చేయలేమని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులైన ఈడీ, సీబీఐలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.


ఇదిలా ఉంటే.. ఈ కేసులో నిందితుడైన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లికి బెయిల్ మంజూరు చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. మరోసారి బెయిల్ గడువును పొడిగించింది. అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్‌పై విచారించిన సుప్రీం కోర్టు.. మరో రెండు వారాలు పొడిగిస్తూ తీర్పునివ్వటం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa