వయస్సుకు చదువు ఎప్పుడూ అడ్డుకాదు. చదవాలనే తపన ఉండాలే కానీ ఏ వయస్సులోనైనా అనుకున్నది సాధించవచ్చు. ఇదే విషయాన్ని నిరూపించారు. ఎస్. లక్ష్మీనరసింహ శాస్త్రి. 77 ఏళ్ల వయస్సులో ఇంజినీరింగ్ మాస్టర్స్ డిగ్రీ సాధించి ఔరా అనిపించాడు. చదువుపై తనకున్న ఆసక్తితో డిగ్రీ పట్టా అందుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని గుడివాడకు చెందిన ఎస్.లక్ష్మీనరసింహ శాస్త్రి ఇంజినీర్గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పని చేశారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో కార్యనిర్వాహక ఇంజినీర్గా పదవీవిరమణ చేశాడు. ఆ తర్వాత కూడా అక్కడే ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే అక్కడే ఎంఎస్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఎర్త్క్వేక్ ఇంజినీరింగ్లో పరిశోధన పత్రాన్ని సమర్పించి ఈ ఏడాది జులైలో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు.
తాను మాస్టర్స్ డిగ్రీని పొందుతానని ఎప్పుడూ ఊహించలేదని శాస్త్రి వెల్లడించారు. కానీ క్యాంపస్లో విద్యార్థుల మధ్య ఉండటం తనకు ఆసక్తిని కలిగించిందని చెప్పాడు. వారి మధ్యే తిరుగుతుండటం వల్ల తరగతి గది వైపు అడుగులు పడ్డాయని చెప్పారు. 'నేను నా థియరీ పేపర్లన్నింటినీ రెగ్యులర్ విద్యార్థులతో పూర్తి చేసినప్పటికీ, నా థీసిస్ పూర్తి చేయడం కోసం కొంచెం కష్టపడాల్సి వచ్చింది. డేటా సేకరణ కోసం విజయవాడకు కనీసం 15 నుండి 20 సార్లు వెళ్లాల్సి వచ్చింది. ముఖ్యంగా కొండవాలులు, నదీతీరాలపై 2 వేల రీడింగ్లు చేయాల్సి వచ్చింది. దానికి కొంచెం ఎక్కువ సమయం పట్టిందని శాస్త్రి వెల్లడించారు.
ట్రిపుల్ ఐటీ ఆలోచన నుంచి ప్రారంభం వరకూ నరసింహ శాస్త్రి ఇంజినీర్గా విధులు నిర్వహించారని ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన భవనాలు, ల్యాబ్లు నిర్మించడంలో ఆయన కీలకపాత్ర పోషించారని కొనియాడారు. విధుల్లో ఉంటూనే మరింత చదవాలన్న ఆసక్తితో రెండేళ్ల క్రితం మాస్టర్స్ డిగ్రీలో చేరి ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. ఈ వయస్సులో మాస్టర్స్ డిగ్రీ సాధించటం చదువుపై ఆయనకున్న మమకారానికి నిదర్శనమన్నారు. కాగా, శాస్త్రి పెద్ద మనవరాలు కర్ణాటకలోని ఒక విశ్వవిద్యాలయంలో బీటెక్ చదువుతుంది. శాస్త్రి 1977లో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసినప్పుడు కాలేజీకి వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ 77 ఏళ్ల వయస్సులో పుస్తకాలు పట్టుకొని కాలేజీకి వెళ్లి మాస్టర్స్ పూర్తి చేసి సూపర్ అనిపించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa