ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి నీ కలసిన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2024, 04:17 PM

నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జి,  కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కంభంపాటి ప్రతాప్ నియోజకవర్గ ముఖ్య నాయకులు మంగళవారం నాడు రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి నీ , తెలంగాణ రాష్ట్ర బిజెపి సంఘటన మంత్రి  చంద్రశేఖర్ జీ , మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ , మరియు  రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,  బంగారు శృతి , దుగ్యాల ప్రదీప్ రావు, కాసం వెంకటేశ్వర్లు  కలిసి నర్సంపేట నియోజకవర్గ పార్టీ సంస్థాగత నిర్మాణ మార్పుల పై మెమొరండం ఇవ్వడం జరిగింది పార్టీ అభివృద్ది మరియు సభ్యత నమోదు కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది.
సంస్థాగత నిర్మాణంపై కార్యకర్తలకు ముఖ్య సూచనలు మరియు  దిశా-నిర్దేశం చేయడం జరిగింది.  ఏకాత్మతా మానవతావాదం & సాంస్కృతిక - ఆర్థిక జాతీయవాదం సిద్ధాంతాలతో దేశ ఐక్యత - శక్తివంతమైన భారత్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP)సభ్యత్వాన్ని స్వీకరించాలని- వికసిత్ భారత్ ను సాకారం చేసుకోవాలని. 8800002024 మిస్డ్ కాల్ ఇచ్చి బి జే పి ఇండియా  సభ్యత్వాన్ని స్వీకరించి బిజెపి కుటుంబంలో సభ్యులుగా నర్సంపేటలో అధిక సంఖ్యలో నమోదు చేయాలని పిలుపునివ్వడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa