ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పసిడి ప్రియులకు శుభవార్త..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 18, 2024, 03:11 PM

 దేశంలో పసిడి ప్రియులకు శుభవార్త. క్రితం రోజున స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు నేడు (డిసెంబర్‌ 18) మళ్లీ తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.78 వేల దిగువకు వచ్చేసింది. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,350 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,840 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.150, రూ.160 చొప్పున తగ్గాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.150 తగ్గి రూ.71,500 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.160 క్షీణించి రూ.77,990 వద్దకు చేరాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.150, 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గాయి. వీటి ధరలు ప్రస్తుతం రూ.71,350, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,840 లుగా ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు మరోసారి నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్ద, ఢిల్లీలో రూ.92,500 వద్ద ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa