ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జోగిపేటలో పంచాయితీ కార్మికుల ఆరెస్టు, విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 18, 2024, 03:23 PM

సీఐటీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ధర్నాకు వెళుతున్న సీఐటీయూ నాయకులను, కార్మికులను జోగిపేట పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు.  ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జీ.సాయిలు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఇందిరా పార్కు వద్ద శాంతియుతంగా చేపడుతున్న నిరసన కార్యక్రమానికి వేళ్లకుండా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
గతంలో కార్మికుల వేతనాలు పెంచినప్పటికీ గత 6 మాసాల వేతనాలు బకాయిలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రూ.18 వేల వేతనం, మల్టీ పర్పస్‌ను రద్దు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చి విస్మరించిందని ఆయన విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆందోల్‌ డివిజన్‌ సీఐటీయూ కార్యదర్శి విద్యసాగర్‌తో పాటు పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa