ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు జోరు కనబరుస్తున్నారు. ఇప్పటికే టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి 154 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం విశేషం. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. వైసీపీ 20 లోపే ఆధిక్యంలో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులంతా వెనుకంజలోనే ఉన్నారు. ఒక్క ముఖ్యమంత్రి జగన్ మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. మంత్రి కాకాణి, బుగ్గన, రోజా, జోగి రమేశ్, బొత్స సత్యనారాయణ, వనిత అంతా వెనుకంజలోనే ఉన్నారు. మాచర్లలో పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కూడా వెనుకంజలోనే ఉన్నారు. ఇదే జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కూటమి కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.
>> ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం వెనుకంజలో ఉన్నారు. ఏపీలో 152 సీట్లకుపైగా టీడీపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది.
జనసేనాని 20 వేలు ప్లస్ లీడ్..
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. పిఠాపురంలో ప్రస్తుతం 20 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
>> కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వంశీ
రెండో రౌండ్ ముగిసేసరికి హిందూపురంలో బాలకృష్ణకు 7 వేల ఆధిక్యం
రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి (టీడీపీ) 25 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి దూసుకుపోతోంది. వందకుపై సీట్లలో టీడీపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. జనసేన పార్టీ 21 సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ ఐదు చోట్ల ముందంజలో ఉంది. అధికార వైఎస్సార్సీపీ 20 సీట్లలో ఆధిక్యంలో ఉంది. టీడీపీ ఒంటరిగానే ప్రభుత్వాన్ని చేసే మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఏపీలో దాదాపు మంత్రులందరూ వెనుకంజలో ఉన్నారు. రాజమండ్రి రూరల్లో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి 25 వేలకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన గుమ్మనూరి జయరామ్ గుంతకల్లులో 600 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యం 10 వేలు దాటింది. కుప్పంలో చంద్రబాబు 5 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేశ్ రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి 8 వేలకుపైగా ఆధిక్యంలో ఉన్నారు. పులివెందులలో జగన్ 5175 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
కూటమి హవా..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటుతోంది. సునామీ సృష్టించేలా ఉంది. టీడీపీ సింగిల్గా ప్రస్తుతం 100 సీట్లకుపైగా స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. జనసేన కూడా అన్ని చోట్లా ఆధిక్యంలో ఉంది. వైసీపీ 20 స్థానాల్లోపు మాత్రమే లీడింగ్లో ఉంది.
పవన్ జోరు..
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రెండో రౌండ్ ముగిసేసరికి 7952 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఏపీలో వెనుకబడ్డ మంత్రులు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్సైడ్గా మారినట్లు కనిపిస్తోంది. పలు చోట్ల అధికార వైసీపీ కి చెందిన మంత్రులు వెనుకంజలో కొనసాగుతున్నారు. మంత్రి బుగ్గన, రోజా, చెల్లుబోయిన వేణు, బొత్స సత్యనారాయణ, మంత్రి అంబటి రాంబాబు, మంత్రి అమర్ నాథ్ వెనుకంజలో ఉన్నారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెనుకంజలో ఉన్నారు.
జగన్ ఆధిక్యం..
పులివెందులలో సీఎం జగన్ ముందంజలో ఉండగా.. డోన్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.
>> పలు చోట్ల వైసీపీ కీలక నేతలు వెనుకంజలో ఉన్నారు. నగరిలో మంత్రి రోజా, గుడివాడలో కొడాలి నానికి తమ ప్రత్యర్థుల కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతానికి కూటమి అభ్యర్థులు 33 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. టీడీపీ 27, జనసేన 6 స్థానాల్లో లీడింగ్లో ఉంది.
>> విజయవాడ, రాజమండ్రి, నరసరావుపేట, అనకాపల్లి, శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ప్రస్తుతం లీడింగ్లో కొనసాగుతున్నారు. విజయవాడ పార్లమెంటులో మొదటి రౌండ్లో టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని 9 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
>> మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర 4300 ఓట్ల ఆధిక్యం
జనసేన అభ్యర్థులు లీడింగ్..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల జనసేన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. భీమవరంలో అంజిబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, తిరుపతి అసెంబ్లీ స్థానం, పి.గన్నవరం సహా పలు చోట్ల కూడా జనసేన తరఫున పోటీ చేసిన వారు లీడ్లో ఉన్నారు.
అవినాష్ రెడ్డి లీడ్..
కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాష్ రెడ్డి తన సోదరి వైఎస్ షర్మిలపై 2 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విజయవాడ ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని 1200 సీట్లకుపైగా ఆధిక్యంలో ఉన్నారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లీడ్.. నగరిలో రోజా వెనుకంజ..
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 4300 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తొలి రౌండ్లో పవన్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ ఎక్కువగా చెల్లని ఓట్లు వస్తున్నాయి. మరోవైపు మంగళగిరిలో నారా లోకేశ్ కూడా ముందంజలోనే కొనసాగుతున్నారు. నగరిలో మంత్రి రోజా వెనుకంజలో కొనసాగుతున్నారు.
నరసరావుపేటలో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాజమండ్రి లోక్సభ స్థానంలో 617 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు పురందేశ్వరి. పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో చెల్లని ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. గజపతి నగరంలో కూడా టీడీపీ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. నెల్లూరు ఎంపీ స్థానంలో వేమిరెడ్డి లీడ్లో ఉన్నారు.
మండపేటలో టీడీపీ అభ్యర్థి లీడింగ్లో కొనసాగుతున్నారు.
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో ఉన్నారు. 1549 ఓట్లతో లీడింగ్లో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి కేఆర్జే భరత్ వెనుకంజలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa