ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్ ను శ్రీ‌వారి బ్రహ్మూత్సవాలకు ఆహ్వానించిన టీటీడీ చైర్మన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2019, 05:24 AM

విజయవాడ రాజ్ భవన్లో గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్ ను కలిసి బ్రహ్మూత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి . తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మూత్సవాల్లో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందాలని  రాష్ట్ర గవర్నర్ దంపతులను ఆహ్వానించారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం టీటీడీలో చేపట్టిన సంస్కరణల గురించి వైవీ  గవర్నర్ కు తెలియజేశారు. శ్రీవారి చెంతకు వచ్చే భక్తులకు తేలిగ్గా దర్శనం చేయించేందుకు భవిష్యత్తులో చేపట్టనున్న విధి విధానాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా గవర్నర్‌ ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో మెరుగైన పరిస్థితులు కల్పిస్తామని వైవీ పేర్కొన్నారు. సెప్టెంబరు 30న ధ్వజారోహణంతో స్వామి వారి  బ్రహ్మోత్సవాలు ప్రారంభ మవుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa