ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు తిరుమ‌ల శ్రీవారికి సీఎం జగన్మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2019, 05:21 AM

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 30 న శ్రీవారికి సీఎం జగన్మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సోమవారం మఽధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతికి చేరుకుంటారు. సాయంత్రం 4.15గంటలకు ‘అలిపిరి- చెర్లోపల్లి’ జంక్షన్‌లో నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 5.15గంటలకు తిరుమలలో మాతృశ్రీ వకుళాదేవి యాత్రికుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేసి, పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. రాత్రి 7గంటలకు ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa