టీడీపీ అధినేత చ్గంద్రబాబుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన ఆరోపణలు చేశారు. గతంలో అగ్రిగోల్డ్ విషయంలో టీడీపీ పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడిందని అన్నారు. హాయ్ల్యాండ్ భూములను కొట్టేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్లాన్ వేశారని అంటూ అగ్రిగోల్డ్తో సంబంధం లేదని చంద్రబాబు ఇప్పటికైనా ప్రకటించగలరా అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన తప్పలన్నిటిని భయటపెడతామని, ప్రజల ముందు గుడ్డలూడదీసి నిలబెడతామని అన్నారు. తనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని చంద్రబాబు చెప్పుకుంటారని, ఆ అనుభవాన్ని మడిచి ఎక్కడో పెట్టుకోవాలని అన్నారు. అంతేకాదు ఎన్నికల ముందు అగ్రిగోల్డ్ బాధితులకు పదివేలు ఇస్తానని చెప్పి అందరి దగ్గర పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని మోసం చేశాడని దుయ్యబట్టారు. ప్రభుత్వాలే ఇలాంటి అవినీతికి పాల్పడుతుంటే ఒక స్పీకర్గా చూస్తూ ఊరుకోలేనని అన్నారు. చంద్రబాబు ప్రతి ఒక్కటి మాయ చేసి మోసం చేశారని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa