ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శవ రాజకీయాలకు వైయస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 07, 2019, 07:56 PM

జగన్ మోహన్ రెడ్డి కి ప్రస్తుతం కష్ట కాలం అని చెప్పాలి. వరదలు, సాంకేతికత లోపం తో ఇసుకని తీయలేకపోతున్నామని వైసీపీ నేతలు పదే పదే చెబుతున్న ప్రతి పక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తూనే వున్నాయి. అయితే నారా లోకేష్ జగన్ ప్రభుత్వం పై దండయాత్రని మొదలు పెట్టింది ఇసుక కొరత వలనే. ఇటీవల నిరసన తెలిపి కార్మికులకు భరోసా ఇచ్చారు. ఇసుక కొరత వలన చనిపోయిన కార్మికులకు 5 లక్షలు కాకుండా ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారాన్ని ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసారు.
జగన్ పాలనా విధానాన్ని ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు నారా లోకేష్. జగన్ అసమర్థత వలనే కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారని అన్నారు. పరామర్శించి వచ్చేలోపే మరో ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని అన్నారు. టీడీపీ శవరాజకీయం చేస్తుంది అని జగన్ అనడం వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు బయలుదేరినట్లే వుంది అని అన్నారు. శవ రాజకీయాలకు వైయస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని మర్చిపోయినట్లున్నారు అని ఎద్దేవా చేసారు. ఆత్మహత్యలను ఇప్పటికైనా అపహాస్యం చేస్తూ మాట్లాడకండి అని నారా లోకేష్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa