ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యాచారం కేసులో రిమాండ్‌లో ఉన్న ఖైదీకి కరోనా పాజిటివ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 19, 2020, 02:32 PM

రిమాండ్‌లో ఉన్న ఖైదీ ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.  దింతో మిగతా ఖైదీలకు, పనిచేస్తున్న సిబ్బందికి  అధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.  అత్యాచారం కేసులో కోర్టు  అతనికి రిమాండ్‌ విధించింది. రిమాండ్ విధించడంతో ఈనెల 16న  అతడిని రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. మరోసటి రోజు ఆ ఖైదీకి  కరోనా టెస్టులు చేయగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో సదరు రిమాండ్‌ ఖైదీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సెంట్రల్‌ జైల్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌. రాజారావు తెలిపారు. రిమాండ్ ఖైదీతో పాటు బ్లాక్‌లో ఉన్న ఖైదీలకు, అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా టెస్ట్‌లు చేయిస్తున్నామని ఆయన  పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa