ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరవీరులకు నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోడీ

national |  Suryaa Desk  | Published : Thu, Dec 16, 2021, 01:56 PM

భారత్ -పాక్  మధ్య 1971లో జరిగిన యుద్ధానికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా అమరులు, పోరాటవీరులను దేశం గుర్తుచేసుకుంది. దాయాది దేశంపై యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు నిండిన సందర్భంగా భారత సాయుధ దళాల శౌర్యాన్ని, త్యాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. కలిసికట్టుగా పోరాడి శత్రుమూకలను ఓడించామని 50వ విజయ్  దివస్  సందర్భంగా మోదీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో రాష్ట్రపతి పర్యటించటం ప్రతి భారతీయుడికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగిస్తోందని ప్రధాని తెలిపారు. భారత్ -పాక్  యుద్ధంలో అమరులైన జవాన్లకు తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ నివాళులర్పించారు. చెన్నైలోని యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి.. సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa