ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమన్వయంతో కృషి చేసి సీఎం లక్ష్యాన్ని నెరవేర్చాలి: డిప్యూటీ సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 16, 2021, 01:57 PM

సర్పంచ్‌, ఎంపీటీసీ సభ్యులు అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కళత్తూరు నారాయణస్వామి పిలుపునిచ్చారు. బుధవారం వెలుగు కార్యాలయంలో ఎంపీపీ లతా బాలాజీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్నికలు ప్రవృత్తి ఆటంకం కాకూడదన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు సమన్వయంతో కృషి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యాన్ని నెరవేర్చలన్నారు.


అదే విధంగా ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు (ఓటిఎస్‌) పథకంపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యాభివద్ధికి సీఎం తీసుకున్న నాడు-నేడు పథకం చరిత్రలో నిలిచిపోతుందని మండలంలో రూ. 15 కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.


అలాగే అసంపూర్తిగా ఉన్న సచివాల యాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. తుపాను వల్ల నష్టపోయిన వారిని గుర్తించి తక్షణ సాయం అంద జేయాలని అధికారులను ఆదేశించారు. కార్వేటినగరాన్ని తహశీల్దార్‌కి, కొల్లాగుంటను ఎంపీడివో దత్తత తీసుకొని అభివృద్ధి చేపట్టాలన్నారు.


అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ అధికారులు సమిష్టి కృషితో పనిచేసి మండల అభివృద్ధికి సహకరిం చాలన్నారు. అదేవిధంగా జడ్పిటిసి పరంజ్యోతి మాట్లాడుతూ మండల సమస్యలను జిల్లాస్థాయి తీసుకెళ్లి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిన్నరెడ్డిప్ప, తహసీల్దార్‌ అమరేంద్ర బాబు, వైస్‌ ఎంపీపీ కార్తీకరెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షుడు లోకనాథ్‌ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పలువురు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa