చిత్తూరు: ప్రేమ విఫలం కావడంతో యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటన పీలేరులోని ఇందిరమ్మకాలనీలో జరిగింది. పోలీసులు కథనం మేరకు తమిళనాడుకు చెందిన కెంజర్ శేఖర్ కుటుంబం 30 ఏళ్లుగా కాకులారంపల్లె పంచాయతీ ఇందిరమ్మకాలనీలో నివసిస్తోంది. శేఖర్ చిన్న కుమారుడు పయని (25) డిగ్రీ వరకు చదువుకుని చెన్నైలో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండేవాడు. కరోనా లాక్డౌన్ సమయంలో స్థానిక ఇందిరమ్మకాలనీకి చేరుకున్నాడు. అప్పటి నుంచి పీలేరు కోటపల్లెలోని ఒక ఆటో కన్సల్టెంట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాత్రి పయని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఎంతకూ తలుపు తీయకపోవడంతో పయని అన్న సంచయచలం, తండ్రి శేఖర్ తలుపులు పగలుగొట్టి చూడగా అప్పటికే ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ఇదిలావుండగా ప్రేమ విఫలం కావడంతోనే పయని ఆత్మహత్య చేసుకున్నాడని, చెన్నైలో ఉద్యోగం చేసే సమయంలో అతడు ప్రేమించిన అమ్మాయికి నాలుగు నెలల క్రితం వివాహం కావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa