మన దేశంలోని ప్రధాన నగరాలలో కరోనా కేసులతో పాటు ఓమిక్రాన్ కూడా చెపుకోదగ్గ రీతిలో దూకుడు ప్రదర్శిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులతోపాటు కరోనా వైరస్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారతదేశ రాజధాని ఢిల్లీతోపాటు ఆర్థిక రాజధాని ముంబైలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా ఈ ప్రాంతాల్లో భారీగా పెరుగుతుండటం ఆందోళనలకు గురిచేస్తోంది. ఢిల్లీలో రెండు వారాల వ్యవధిలో ఒమిక్రాన్ కేసులు 2-3 శాతం నుంచి 25-30 శాతానికి పెరిగాయి. దేశంలో జన్యక్రమాన్ని విశ్లేషించే కన్సార్టియం(ఇన్సాకాగ్) ఆధ్వర్యంలోని ఢిల్లీ ల్యాబ్ ఈ విషయాన్ని పేర్కొంది. ఢిల్లీ ఆంక్షలు విధించినట్లు ప్రకటించిన గంటల్లోనే 50 శాతం కరోనా కేసులు పెరగడం గమనార్హం. గత 34 గంటల వ్యవధిలో ముంబైలో 70 శాతం కరోనా కేసులు పెరగ్గా.. ఢిల్లీలో 50 శాతం పెరుగుదల నమోదు చేశాయి. ఆర్థిక రాజధానిలో 1377 కరోనా కేసులు నమోదు కాగా, దేశ రాజధానిలో 496 కేసులు వెలుగుచూశాయి. ఈ రెండు నగరాల్లో ఒక్కో కరోనా మరణం సంభవించింది. డిసెంబర్ 8 తర్వాత ముంబైలో అత్యధిక కేసులు వెలుగుచూశాయి. 188 శాతం కేసులు పెరిగాయి. ఢిల్లీలో భారీగా కేసులు పెరగడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవెల్-I (ఎల్లో అలర్ట్)ని అమలు చేస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ఆంక్షల ఉత్తర్వులను జారీ చేశారు. ఢిల్లీలో ఎల్లో అలెర్ట్లో భాగంగా సినిమా హాళ్లు, జిమ్స్, స్పాలు మూతపడనున్నాయి. స్కూల్స్, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, సినిమా హాళ్లు, స్పాలు, జిమ్లు, ల్టీప్లెక్స్లు, బాంక్వెట్ హాల్స్, ఆడిటోరియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు మూసివేయనున్నారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. ఇక పెళ్లిళ్లు, అంతిమ సంస్కారాలకు 20 మందికి మాత్రమే అనుమతించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa