కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కనీసం పైసల్లో కూడా తేడా లేకుండా అదే ధరలు కొనసాగుతున్నాయి. దీనిపై వాహనదారులు సంతోషంగా ఉన్నారు. అయితే ఈ సంతోషం కొంత కాలమేనని, త్వరలో పెట్రో ధరల పెంపు తప్పదని డెలాయిట్ ఇండియా ఎల్ఎల్పీ అనే సంస్థ పేర్కొంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పెట్రో ఉత్పత్తుల రిటైల్ ధరల్లో కంపెనీలు మార్పులు చేయట్లేదని ఆ సంస్థ ప్రతినిధి దెబాశిష్ మిశ్రా ఓ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
మార్చి 10 తర్వాత పెట్రో ధరలు రూ. 8 నుంచి రూ.9 మేర పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం స్తబ్ధుగా ఉన్నాయన్నారు. గ్యాస్, చమురు ధరల్లో ఎలాంటి మార్పులూ ఇటీవల కాలంలో చేయలేదన్నారు. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే దేశంలో కూడా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగేవని గుర్తు చేశారు. ఆ విధంగా ధరలను పెంచే అధికారం ఆయా పెట్రో ఉత్పత్తుల కంపెనీలకు కేంద్రం కట్టబెట్టిందని తెలిపారు. ప్రస్తుతం ధరలు పెరిగితే ప్రజావ్యతిరేకత వస్తుందనే కారణంగా ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం లేదని తెలుస్తోందని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa