ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం అయ్యాక ఆ సమస్యల పరిష్కారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 13, 2022, 03:12 PM

తమ పార్టీ అధినేత  పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాక మత్స్యకారుల సమస్యలను  పరిష్కరిస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన మత్స్య వికాస విభాగం ఆధ్వ‌ర్యంలో ఆ పార్టీ మత్స్యకార అభ్యున్నతి యాత్ర ప్రారంభించింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం సూర్యరావుపేటలో ఈ యాత్రను జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే జ‌న‌సేన ధ్యేయ‌మ‌ని చెప్పారు. త‌మ పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం అయ్యాక మ‌త్స్య‌కారుల అభివృద్ధికి కృషి చేస్తార‌ని ఆయ‌న అన్నారు. అభివృద్ధి పేరుతో మ‌త్స్య‌కారుల కుటుంబాల‌ను ఖాళీ చేయించ‌డం స‌రికాద‌ని ఆయ‌న చెప్పారు. వెంట‌నే మ‌త్స్య‌కారుల‌ను ఆదుకునేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇదిలావుంటే మత్స్యకార అభ్యున్నతి యాత్రలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa