ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షోభం సమయంలో విభేదాలు పక్కనెట్టి...ఐక్యత చాటుదాం

national |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 01:50 PM

ఉక్రెయిన్, రష్యా యుద్దం నేపథ్యంలో మన దేశంలోనూ రాజకీయ వాతావరణం మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఊహించని విధంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు పలికారు. ఆయనకు ఓ లెటర్ కూడా రాశారు. మోదీ అంటేనే నిప్పులు కురిపించే మమతా బెనర్జీ ఓ అంశంలో మాత్రం సపోర్ట్‌గా నిలిచారు. ఉక్రెయిన్‌ సంక్షోభం సందర్భంగా ఈ మార్పు చోటుచేసుకుంది. ఓ జాతీయ నేతగా ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో మన దేశ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు ఆ లెటర్‌లో పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభ సమయంలో విభేదాలను పక్కన పెట్టాలని, ఓ దేశంగా ఐక్యతను చాటాలని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని ప్రధానిని కోరారు. ఉక్రెయిన్‌లో ఉండిపోయిన భారతీయ పౌరులను రక్షించుకునేందుకు అందరితో చర్చించాలని ఆమె పేర్కొన్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా మన విదేశీ వ్యవహార సూత్రాలు ఏ రకంగా దెబ్బతినవద్దని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే ఉక్రెయిన్ సంక్షోభంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రష్యా దాడులను ఖండిస్తూ భద్రతా మండలి చేసిన తీర్మానంపై చర్చిస్తున్నారు. అయితే ఈ మీటింగ్‌లో 15 సభ్యదేశాలు భధ్రతా మండలి ఓటింగ్‌లో పాల్గొని నిర్ణయం తీసుకోగా భారత్ ఈ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa