ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించాలని ఉంది : ప్రియమణి

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 30, 2020, 09:13 AM

ఎన్నాళ్ళ నుంచో లేడీ విలన్ పాత్రలో నటించాలని ఆశపడ్డానని తెలిపింది నటి ప్రియమణి. 2004లో ‘కన్‌గళాల్‌ ఖైదు సెయ్‌’ చిత్రం ద్వారా తమిళ సినీ రంగానికి పరిచయమైన ప్రియమణి ‘పరుత్తివీరన్‌’ చిత్రంలో నటించి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. లాక్‌డౌన్‌లో ఇంటివద్దే ఉంటున్న ప్రియమణి నెటిజన్లతో మాట్లాడుతూ ‘విరాట్‌ పర్వం’ అనే చిత్రంలో తాను నక్సలైట్‌ పాత్రలో నటిస్తున్నానని, లాక్‌డౌన్‌ రోజుల్లో కొత్త కథలు వింటున్నానని చెబుతూ గతంలో హీరోలకు అధికంగా గౌరవించి హీరోయిన్లకు తక్కువగా చూసేవారని, ప్రస్తుతం ఇద్దరినీ సమానంగా గౌరవిస్తున్నారని వివరించారు. కాజల్‌ అగర్వాల్‌, తమన్నా, నయనతార, సమంతా వంటి మేటి హీరోయిన్లు వారికున్న మార్కెట్‌ ప్రకారం అధికంగా పారితోషికం తీసుకుంటున్నారని, తనకు పారితోషికం ముఖ్యం కాదని మంచి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడమే తన ఆశయమని తెలిపింది. ప్రస్తుతం నిర్మాతలకు తనకిస్తున్న పారితోషికంతోనే సంతృప్తి చెందుతున్నానని, మంచి భర్త, కుటుంబంతో హాయిగా జీవనం సాగిస్తున్నానని, పెళ్ళయిన మూడో రోజే సినిమా షూటింగ్‌ వెళ్ళానని, అత్తగారింటిలోని వారంతా తనను నటించమనే ప్రోత్సహిస్తున్నానని, తన కాల్షీట్‌ వ్యవహారాలన్నింటిని భర్తే చూస్తున్నానని ప్రియమణి చెప్పారు.  ‘పడయప్పా’ చిత్రంలో రమ్యకృష్ణ నటించిన ‘నీలాంబరి’ వంటి నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించాలని ఎన్నాళ్ళనుంచో కోరికగా ఉందని, అది ఎప్పుడు నెరవేరుతుందో తెలియదని, ఇక ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ రోల్‌లో నటించాలని కూడా ఆశపడుతున్నానని తెలిపింది. లాక్‌డౌన్‌ ఎప్పుడు తొలగిస్తారో, షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియటం లేదని, ప్రస్తుతం టీవీ ప్రోగ్రామ్స్‌లో అధికంగా పాల్గొంటున్నానని చెప్పాడు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa