ట్రెండింగ్
Epaper    English    தமிழ்

`మేజర్` సందీప్ ఉన్నికృష్ణన్ కి అడవి శేషు నివాళులు

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 26, 2021, 06:34 PM

26/11 ముంబై దాడుల్లో ప్రజల ప్రాణాల్ని కాపాడుతూ మేజర్ ఉన్నికృష్ణన్ అమరుడైన సంగతి తెలిసిందే. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఈ సంస్మరణలో శేష్ పాల్గొన్నారు. మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్ లో అడవి శేషు నటిస్తోన్న సంగతి తెలిసిందే. `మేజర్` టైటిల్ తో ఈ చిత్రాన్ని శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తున్నారు. శోభిత ధూళిపాల..సాయి మంజ్రేకర్.. ప్రకాష్ రాజ్..రేవతి..మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు..హిందీ..మలయాళ భాషల్లో తెరకెక్కించారు. ఇతర భాషల్లోను ఇది అనువాద రూపంలో విడుదల కానుంది. ఇదే అడవి శేషు తొలి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. అయితే  ఉన్ని కృష్ణన్ పాత్ర కోసం శేషు ఆయన కుటుంబ సభ్యుల్ని కలిసి ఎన్నో వివరాలు తెలుసుకున్నారు. ఆ రకంగా శేషు ఆ కుటుంబానికి బాగా దగ్గరయ్యాడు. షూటింగ్ సమయంలో ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులు సైతం అప్పుడప్పుడు సెట్స్ కి వస్తూ వెళ్లేవారు. ఆ విధంగా ఆ ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న మూవీ రిలీజ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa