తన రాబోయే చిత్రం 'మేజర్' కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నా తెలుగు నటుడు అడివి శేష్, అతను రెండు బాలీవుడ్ సినిమాలకు సంతకం చేసినట్లు సమాచారం. అతని మొదటి పాన్-ఇండియా చిత్రం, జీవిత చరిత్ర డ్రామా- 'మేజర్' ఫిబ్రవరి 11, 2022 న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది, అతను అన్ని ప్రాంతాల లోను ప్రమోషన్స్ మొదలు పెట్టేసాడు.
అడివి శేష్, తన పాన్-ఇండియా చిత్రం 'మేజర్' తెరపైకి రాకముందే, రెండు ఆసక్తికరమైన హిందీ వెంచర్లలో నటించడానికి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అడివి శేష్ తన కిట్టిలో ఉన్న ఆఫర్లలో, రెండు హిందీ సినిమాలు ఉన్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. ఇటీవల మీడియాతో మాట్లాడిన 'గూడాచారి' నటుడు తన బాలీవుడ్ ప్రదర్శన గురించి కూడా సూచించాడు. "నేను రెండు హిందీ సినిమాలను సైన్ చేసాను, 'మేజర్' థియేటర్లలో విడుదలైన తర్వాత మాత్రమే అధికారిక ప్రకటన చేయబడుతుంది" అని అడివి శేష్ చెప్పారు.
'మేజర్' హిందీతో పాటు అన్ని దక్షిణ భారత భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్నందున 'మేజర్' ప్రమోషన్లను ప్రారంభించడానికి శేష్ తన బృందాన్ని సిద్ధం చేశాడు. ఇది 26/11 అమరవీరుడు- మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర అయినందున, శేష్ ఒక పోరాట యోధుడిగా అడుగుపెట్టడానికి ముందు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పై తగిన పరిశోధన చేశాడు.
'మేజర్' చిత్రంలో సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, శోభితా ధూళిపాళ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన 'మేజర్' చిత్రాన్ని సోనీ పిక్చర్స్, GMB ఎంటర్టైన్మెంట్ మరియు A S మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa