టీవీ యాంకరింగ్తో పాటు సినిమాలకు కూడా పేరుగాంచిన తెలుగు నటి అనసూయ భరద్వాజ్, సూపర్ స్టార్ మమ్ముట్టితో కలిసి మలయాళంలోకి అడుగుపెట్టనుంది. మలయాళ చిత్రం ‘భీష్మ పర్వం' మూవీ నుండి అనసూయ పోస్టర్ను నిర్మాతలు విడుదల చేసారు, ఇప్పుడు ఈ అనసూయ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్లో అనసూయ మధ్య వయస్కురాలైన ఆలిస్ పాత్రలో కనిపించింది. అనసూయ డెగ్లామ్ లుక్ అందరినీ ఆకట్టుకుంది, ఈ పోస్టర్ 'భీష్మ పర్వం'లో ఆమె పోషించే పాత్ర చుట్టూ చాలా అంచనాలను సృష్టించింది. ఉత్సాహంగా ఉన్న నటి తన మొదటి మలయాళ ప్రాజెక్ట్ పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. మీ ఆలిస్గా ఉండటానికి నన్ను అనుమతించినందుకు ధన్యవాదాలు అని అనసూయ ట్వీట్ చేసింది.
మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన ‘భీష్మ పర్వం’ సినిమాలో అనసూయ కథకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అని సమాచారం. అమల్ నీరద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భీష్మ పర్వం’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది ఫిబ్రవరి 24, 2022న థియేటర్లలో విడుదల కానుంది. ‘భీష్మ పర్వం’లో నటి నదియా, వీణా నందకుమార్, దిలీష్ పోతన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa