ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లోపాల్గొన డింపుల్ హయతి

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 28, 2022, 01:24 PM

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీస్ ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటి.. తమ అభిమానుల్ని కూడా మొక్కలు నాటమని సూచించడం అందరికీ తెలిసిందే. ఇప్పుడీ లిస్ట్ లోకి రవితేజ ‘ఖిలాడి’ చిత్రంతో కథానాయికగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న డింపుల్ హయతి కూడా వచ్చి చేరింది. నిన్న (గురువారం) ఛాలెంజ్ లో భాగంగా 3 మొక్కలు నాటిన డింపుల్ ..సంతోషాన్ని వ్యక్తం చేసింది . గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం తనకు ఆనందానిస్తోందని డింపుల్ తెలిపింది. ఈ సందర్భంగా ‘ఖిలాడి’ హీరో రవితేజ, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, మరో కథానాయిక మీనాక్షి చౌదరి, దర్శకులు రమేష్ వర్మలను ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటి.. ఈ చెయిన్ ను కంటిన్యూచేయాలని సవాల్ విసిరింది. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa