టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ,దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే.ఈ మూవీకి టెంపరరీ గా SSMB28 అని టైటిల్ పెట్టారు.ఈరోజు ఈ సినిమా లాంచ్ వేడుక హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఫిల్మ్ స్టూడియోలో జరగనుంది.ఈరోజు ఉదయం 10 గంటలకు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు.మహేష్ బాబు ఈ ఈవెంట్ స్కిప్ చేయగా, అతని తరపున అతని భార్య నమ్రతా శిరోద్కర్ హాజరయ్యారు.దర్శకుడు త్రివిక్రమ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా మార్చిలో సెట్స్పైకి రానుంది.మహేష్ సరసన పూజా హెడ్గే నటిస్తుండగా,థమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా గురించి ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa