2018లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ సినిమా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యష్ హీరోగా నటించిన కేజిఎఫ్. ఈ సినిమా విడుదలైన అన్ని భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక అప్పటినుండి ఈ సినిమా రెండవభాగంగా తెరకెక్కుతున్న కేజీఎఫ్ చాప్టర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. నిన్న సాయంత్రం బెంగుళూరులో ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్, ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్న బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ ఇంకా మలయాళ సూపర్ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్, కేజీఎఫ్ చిత్రబృందం అభిమానులు పాల్గొన్నారు. ఈ ఈవెంటుకు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించటం విశేషం.
ఈ ఈవెంట్లో హీరో యష్ మాట్లాడుతూ... ఈ సినిమాలో అధీరా పాత్రలో నటిస్తున్న సంజయ్ సర్ లంగ్ క్యాన్సర్ కారణంగా కొన్నాళ్ళు షూటింగ్ కు రాలేదు. ట్రీట్ మెంట్ తరవాత మళ్ళీ షూటింగ్లో పాల్గొన్న సంజయ్ సర్ తో జాగ్రత్తగా ఉండమని చిత్రబృందానికి పదే పదే చెప్పేవాడిని. ఆయనతో యాక్షన్ సీన్స్ చేసేటపుడు మేమంతా భయపడేవాళ్ళం. ఇది గమనించిన సంజయ్ సర్ ఒకరోజు నన్ను దగ్గరకు పిలిచి నన్ను ఆ విధంగా అవమానించకు. నేను నటించగలను. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలను... అని అన్నారు. వృత్తి పట్ల ఆయనకున్న నిబద్దతే ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టిందనీ, చెప్పినట్లుగానే ఈ సినిమాకు సంజయ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని యష్ చెప్పుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa