పాండిరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అండ్ గ్లామర్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించిన "ఎతర్క్కుం తునింధవన్" సినిమా మార్చి 10,2022న థియేటర్లలో విడుదలైంది.సన్ పిక్చర్స్ ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని నిర్మించింది.తాజా అప్డేట్ ప్రకారం ఇప్పుడు,సూర్య డైరెక్టర్ బాలతో ఒక సీరియస్ డ్రామా చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా కన్యాకుమారిలో పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,తొలి చిత్రం 'ఉప్పెన' తో సంచలనం సృష్టించిన మోస్ట్ హ్యాపెనింగ్ యాక్ట్రెస్ కృతిశెట్టి ఈ సినిమాలో సూర్య సరసన జోడిగా కనిపించనుంది అని మేకర్స్ ప్రకటించారు.ఈ సినిమాకి టెంపరరీగా 'సూర్య 41' అనే టైటిల్ ని లాక్ చేసారు.ఈ సినిమాలో సూర్య డబల్ రోల్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని జ్యోతిక,సూర్య అండ్ 2D ఎంటర్టైన్మెంట్పై రాజశేఖర్ పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa