'నాగిని 6' సీరియల్ నటి తేజస్వి ప్రకాశ్ ఇప్పటికే బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈమె భారీ సంఖ్యలో అభిమానుల్ని సొంతం చేసుకుంటోంది. నాగిని సీరియల్ కోసం ఈ నటి ఒక్కో ఎపిసోడ్కు ఏకంగా రూ.2లక్షల పారితోషికం తీసుకుంటోందట. సోషల్ మీడియాలో ఒక్కో పోస్ట్కు రూ.10-15 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 1993లో జూన్ 11న సౌదీ అరేబియాలో జన్మించిన తేజస్వి ప్రకాశ్ ముంబై యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివింది. 2012లో బుల్లితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు సీరియళ్లలో నటించింది. పలు రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. ఈ క్రమంలోనే బిగ్బాస్ 15వ సీజన్ విజేతగా నిలిచింది. పలు మ్యూజిక్ వీడియోల్లోనూ మెరిసింది. ఇప్పుడు నాగిని 6 తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa