ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు న్యూ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 01:23 PM

తన పాతికేళ్ల సినీ ప్రస్థానంలో మొట్టమొదటిసారిగా చారిత్రక నేపధ్యమున్న చిత్రం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. క్రిష్ జాగర్లమూడి దర్శత్వంలో, మొఘల్ చక్రవర్తుల కాలం నాటి ఒక వాస్తవ ఘటన ఆధారంగా రూపొందిన కథతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు పవన్. రాజకీయ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుండి వకీల్ సాబ్, భీమ్లానాయక్ వంటి రీమేక్ సినిమాలను చేసిన పవన్ మొదటిసారిగా తెలుగులో డైరెక్ట్ మూవీని చేస్తున్నారు. 


దాదాపు యాభై శాతం షూటింగును పూర్తి చేసుకున్న ఈ చిత్రం పవన్ రాజకీయాల కారణంగా బిజీగా ఉండటంతో ఆలస్యమవుతూ వచ్చింది. మిగిలిన యాభైశాతాన్ని ఎలాగైనా పూర్తి చేయాలనే గట్టి పట్టుదలతో రంగంలోకి దిగిన పవన్ ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 5నెలల సమయాన్ని కేటాయించారని వార్తలు వస్తున్నాయి. ఆగస్టు నాటికి షూటింగును పూర్తి చేసి, ఆ తరవాత శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరిపి, వీలైనంత తొందరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసురావాలని అనుకుంటున్నారట పవన్. ఏప్రిల్ 6వ తేదీ నుండి ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మొదలవనుంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa