ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు చిత్రసీమలో మరో విషాదం

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 03:29 PM

తెలుగు చిత్రసీమలో మరో విషాదం ఏర్పడింది. ప్రముఖ దర్శకుడు శరత్ కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన దర్శకత్వంలో తెలుగులో 20 సినిమాలు తెరకెక్కాయి. డియర్ అనే న‌వ‌ల నేపథ్యంతో తీసిన ‘చాద‌స్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. బాల‌కృష్ణ, సుమ‌న్‌ హీరోలుగా పలు విజయవంతమైన సినిమాలు తెరకెక్కించి, హిట్లు కొట్టారు. అక్కినేని నాగేశ్వరరావుతో ‘కాలేజీ బుల్లోడు’, జ‌గ‌ప‌తిబాబుతో ‘భ‌లే బుల్లోడు’, బాలకృష్ణతో వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, సుమన్‌తో చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ బావమరిది, చిన్నల్లుడు వంటి చిత్రాలకు శరత్ దర్శకత్వం వహించారు. ఆయన పెళ్లి చేసుకోకుండా అవివాహితుడుగానే ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa