ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సందీప్ రెడ్డి వంగా సినిమాలో గీతాంజలి పాత్రలో రష్మిక మందన్న

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 02, 2022, 07:14 PM

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో 'యానిమల్' అనే సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక రణబీర్‌తో రొమాన్స్ చేయనుంది కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈరోజు ఉదయం ఉగాది సందర్భంగా, సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాలో గీతాంజలి రోల్ చేయటానికి రష్మిక మందన్నను సెలెక్ట్ చేసినట్లు ప్రకటించారు.
ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో అనిల్ కపూర్ అండ్ బాబీ డియోల్ కూడా కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ వేసవిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది అని సమాచారం. 'యానిమల్' ఆగస్ట్ 11, 2022న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ అండ్ సినీ1 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa