చందూ మొండేటి దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ 'కార్తికేయ 2' సినిమాలో కనిపించనున్నారు. మిస్టరీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా 2014లో విడుదలైన 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్లో జరుగుతోంది. ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ జోడిగా నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ జూలై 22, 2022న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రముఖ OTT ప్లాట్ఫారమ్ ZEE5 ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకోగా, 'కార్తికేయ 2' శాటిలైట్ రైట్స్ ని ZEE తెలుగు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి కాల భైరవ సంగీత అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa