పరశురామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా మే 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. తాజాగా రిపోర్ట్స్ ప్రకారం, హైదరాబాద్లోని భ్రమరాంబ థియేటర్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి జరగనున్న ఈవెంట్లో ఈ సినిమా ట్రైలర్ను గ్రాండ్గా విడుదల చేయనున్నట్టు సర్కార్ వారి పాట టీమ్ ప్రకటించింది. తర్వాత 04:05 PMకి ఆన్లైన్లో ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయబడుతుంది అని సమాచారం. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. బ్యాంకింగ్ స్కామ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa